Tuesday, July 3, 2007

శతశతమానం భవతి...

satamaanam-bhavathi.png











అందరికీ సహస్ర వందనాలు. ఈరోజు నేను నా బ్లాగులన్నింటిలో కలిపి వెయ్యి టపాలు పూర్తి చేసాను. నేను బ్లాగు రాయడం మొదలెట్టి తొమిది నెలలైంది. గుంపులో కొచ్చి ఏడాది అయ్యింది. ఈ పయనం మీ అందరి సహకారంతో


చాలా సునాయాసంగా నడిచింది. ఇప్పటివరకు ఈ బ్లాగు సందర్శకులు - 15,000 .....


 


జ్యోతి 200


షడ్రుచులు 300


అన్నపూర్ణ 200


గీతలహరి 275


నైమిశారణ్యం 25


 


 


నేను బ్లాగులు రాసేది నాకోసం. ఎవరినీ ఉద్దరించడానికి కాదు. నాకు తెలుసు ఈ బ్లాగులో నేను పనికొచ్చేది ఏమీ రాయనని. ఎప్పుడు సరదా కబుర్లే ఉంటాయి. ఏం చేయను సీరియస్ విషయాలు రాయాలని ఎంతో ప్రయత్నించాను. అసలవి నా బుర్రకెక్కితే కదా బ్లాగులో రాసేది. ప్రసాద్ అంతరంగం చూసి ఎన్నో సార్లు అనుకుంటాను. నేను అంత లోతుగాఎందుకు ఆలోచించను అని. ఇంకో విషయం చెప్పాలి. రాధిక నా బ్లాగులన్ని చదివి వ్యాఖ్యలు రాస్తుంది. కాని నేను తన కవితలను గురించి వ్యాఖ్యలు రాయను. తన కవితలను బాగుంది అని చెప్పడం బాగుండదు. చాలా బాగుంటాయి కాని నా భావాలను సరిగా వ్యక్తపరచలేను అందుకే ఏమీ రాయను తన బ్లాగులో. మిగతా బ్లాగుల్లో కూడా నాకు అర్ధం కానివి చాలా ఉన్నాయి. వాటిలో వ్యాఖ్యలు ఎమని రాయను మరి.


 


నేను ఎన్నో విషయాలలో సాంకేతికమైన సందేహాలు అడిగి వీవెన్,సుధాకర్ ని తెగ సతాయించాను. పాపం వాళ్ళు ఓపికగా చెప్పేవారు.. ఊరికే సతాయించినందుకు సారీఅడిగినవన్నీ చెప్పినందుకు థాంక్స్సాహిత్య సంబంధమైన విషయాలలో కొత్తపాళిగారు కూడా ఎంతో సహాయం చేసారు. ఇలా అందరికీ నా కృతజ్ఞ్తతలు.


 


 


ఒక విషయం…. ఇక నేను రాయడం తగ్గించి, లేదా తాత్కాలికంగా ఆపేసి చదవడం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. విశాలాంధ్రపై దాడి చేయాలి.


 


రవి, వీవెన్, నవీన్ నేను తెవికి కి వస్తున్నాను. కాసింత చోటు ఇవ్వండి.


 


 


నా మొదటి టపా ఇది .. ధమాకాతో మొదలెట్టా…….స్పీకర్లు ఆన్ చేయండి.


 


 


 


 


ఇప్పుడొక SHORT BREAK...

No comments:

Post a Comment

test

Loading...