(చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-7 అవమానం-1
ఈ రాశివారికి గురుడు నవంబరు 21 వరకు రెండింట సువర్ణమూర్తి. తదుపరి సంవత్సరమంతా
మూడింట తామ్రమూర్తి. శని జులై 15 వరకు పదింట, తదుపరి పదకొండింట రజితమూర్తులు.
ఈ రాశివారికి నవంబరు వరకు యోగప్రదం. ఉత్సాహప్రదం. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.
ఆరోగ్యం పెంపొందుతుంది. సంకల్పం ఫలిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధు
మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతకాలంగా వృత్తి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగి
పోతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. సమయోచితమైన ఆలోచనలు స్పురిస్తాయి.
స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
దశమ శని అంతగా శుభప్రదం కాకపోయినప్పటికీ రాశిరీత్యా పూర్ణయోగప్రదుడు కాబట్టి
శుభఫలితాలు కనిపిస్తాయి. వాక్చాతుర్యంతో,నాయకత్వ లక్షణాల్తో ముందంజ వేస్తారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది. హుందాగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు.
విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. జులై తరువాత లాభమందు శని పూర్తి
యోగప్రదుడు అవుతాడు. ఫలితంగా అన్ని రంగాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. గౌరవ
పురస్కారాలు లభిస్తాయి. పాత బాకిలు వసూలవుతాయి. ఆర్ధిక వ్యవహారాలు ఫలిస్తాయి.
కాంట్రాక్టరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మొదట కొన్ని చిక్కులు ఎదురైన చివరకు
లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపార
రంగంలోని వారు రాణిస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల స్టాకిస్టులకు,కోళ్ళు, మత్స్య
వ్యాపారులకు స్వల్ప లాభం, షేర్ల లావాదేవీలు అంతగా లాభించకపోవచ్చు. సోదర,
బంధువర్గం నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
వస్త్రాలు, ఫైనాన్స్, రసాయనిక వ్యాపారులకు 1,2,3,5,6,7,10 మాసాలు యోగప్రదం.
మెట్ట వ్యవసాయం వారికి లాభదాయకం. ఈ మాసాల్లో విద్యార్థులకు పురోభివృద్ధి.
నూతన విద్యా ఉద్యోగాలకు అనుకూలం. సంవత్సరం పూర్వార్ధంలో భాషా పండితులు,
కళా శాస్త్రకోవిదులకు ఆటంకాలు ఎదురైనా చివరకు పురోగతి సాధిస్తారు. సైన్సు, అర్ధ
శాస్త్ర విద్యార్ధులు, ఈ రంగాల ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగులకు బదిలీల
బెడద తప్పకపోవచ్చు. ఉన్నతాధికారుల సహకారంతో ప్రమోషన్లు సాధిస్తారు. సినీ,
వైద్య, వ్యాపార రంగాల వారికి సంవత్సరంలోని మొదటి ఆరు మాసాలు ప్రోత్సాహకరంగా
ఉంటుంది.
చిత్తవారు పగడం, స్వాతివారు గోమేధికం,కెంపు విశాఖవారు పగడం,పుష్యరాగాభరణాలు
ధరించిన యోగప్రదం. ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు 2,6,7,9. సోమ శుక్ర, శనివారములు
యోగదాయకం. మొత్తం మీద వీరు కుజ, రాహు గ్రహాలకు జపశాంతులు, మంగళవార
నియమాలు, లక్ష్మీ, గణేశ, విష్ణు సహస్ర, సాయి శివ ఆరాధనలు యోగప్రదాలు. స్త్రీలు
మంగళ, శుక్ర శనివారాలు నవగ్రహ స్తోత్ర, శివ, ఆంజనేయ పూజలు జరుపుకుంటే ఇష్ట
కార్యసిద్ధి, కుటుంబ సభ్యులకు సౌఖ్యం కలుగుతుంది.
No comments:
Post a Comment